కొత్తపాసుపుస్తకాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-04T04:23:26+05:30 IST

మరికల్‌ మండల శివారులో సర్వేనెంబర్‌ 449లో రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లో గురువారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు దిగ్బందం చేశారు.

కొత్తపాసుపుస్తకాలు ఇవ్వాలి
తహసీల్దార్‌ కార్యాలయం దిగ్బందం చేసిన రైతులు

మరికల్‌, డిసెంబరు 3 : మరికల్‌ మండల శివారులో సర్వేనెంబర్‌ 449లో రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లో గురువారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు దిగ్బందం చేశారు. రైతుల భూములు రైతులకు ఇవ్వాలని, కొత్త పాసుపుస్తకాలు అందించాలని 22రోజులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు రిలేనిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి  స్పందన రాకపోవడంతో కార్యాలయం దిగ్భందించామని నాయకులు అన్నారు. రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందించే వరకు ఇక్కడి నుంచి కదలబోమన్నారు. తహసీల్దార్‌ తిరుపతయ్య ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రిలేనిరాహార దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో వెంకట్రామారెడ్డి, గోపాల్‌, వెంకటేష్‌, మల్లేష్‌,లక్ష్మయ్య, రాములు, రాజమల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:23:26+05:30 IST