రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: మహేష్‌కుమార్‌ గౌడ్‌

ABN , First Publish Date - 2022-04-10T21:11:03+05:30 IST

రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో

రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: మహేష్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్: రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక ఢిల్లీలో ధర్నా చేయడమేంటి? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయడంలేదని విమర్శించారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదని, రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కైందని ఆరోపించారు. కేసీఆర్‌ దొంగ దీక్షలు చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనాలని మహేష్‌కుమార్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-10T21:11:03+05:30 IST