రైతులే నడుం బిగించి..
ABN , First Publish Date - 2022-08-13T06:04:42+05:30 IST
రోడ్డుపై పడిన గండిని పూడ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా నడుం బిగించారు.
కలిదిండి, ఆగస్టు 12: రోడ్డుపై పడిన గండిని పూడ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా నడుం బిగించారు. కొండంగి–మట్టగుంట రహదారి మధ్యలో గండి పడడంతో వాహనాలు దిగబడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఎకరానికి రూ.500 చొప్పున చందా వేసుకుని ఆయా గ్రామాల రైతులు రోడ్డు మరమ్మతులు చేయటానికి ముందుకు వచ్చారు. టిప్పర్లతో కంకర దిగుమతి చేసి గండిని పూడ్చుతున్నారు. గండి పూడ్చివేత పూర్తైన వెంటనే రోడ్డు మరమ్మతులు స్వచ్ఛందంగా చేపడతామని రైతులు తెలిపారు. కొండంగి, మట్టగుంట, పెదలంక సర్పంచ్లు జ్యోతి, రత్నమణి, మోకా లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.