లో వోల్టేజి సమస్యపై రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-02-28T05:34:50+05:30 IST

బొర్రంపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని బొర్రంపాలెం, సింగరాయపాలెం, వల్లంపట్ల గ్రామాలకు చెందిన రైతులు లో–వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు.

లో వోల్టేజి సమస్యపై రైతుల ధర్నా

టి.నరసాపురం, ఫిబ్రవరి 27: బొర్రంపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని బొర్రంపాలెం, సింగరాయపాలెం, వల్లంపట్ల గ్రామాలకు చెందిన రైతులు లో–వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పంటలు వేశామని, అవి ఎండిపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. విద్యుత్‌ ను షిఫ్ట్‌ల వారీగా ఇవ్వడం లేదని సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే సిబ్బంది స్పందిం చడం లేదని ఆరోపించారు. వల్లంపట్లలో కొత్త సబ్‌స్టేషన్‌ మంజూరైందని రెండు నెలలుగా చెబుతున్నారని, పనులను త్వరగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కామవరపుకోట ఏడీఈ ఓంకార్‌  రైతులతో చర్చించి ఆందోళన విరమింపచేశారు.  రైతులు కె.బాలకృష్ణ, ఆంధ్రబాబు, ఎన్‌.అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:34:50+05:30 IST