కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలి

ABN , First Publish Date - 2021-04-21T04:55:56+05:30 IST

రైతుల సంక్షేమం కోసం గ్రామాల్లోని ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధా న్యం విక్రయించాలని డీసీఎమ్మెస్‌ ఛైర్మన్‌ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలి
లక్ష్మికాంతపూర్‌లో కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ

 డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగయ్య
దండేపల్లి, ఏప్రిల్‌ 20 : రైతుల సంక్షేమం కోసం గ్రామాల్లోని ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధా న్యం విక్రయించాలని డీసీఎమ్మెస్‌ ఛైర్మన్‌ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. డీసీఎంఎస్‌ ఆఽధ్వర్యంలో దండేపల్లి మండ లంలోని లక్ష్మికాంతపూర్‌, చింతపల్లి, రెబ్బనపల్లి, కోర్విచెల్మ వెల్గనూర్‌. పెద్దపేటలో ఐకేపీ వరిధాన్యం కోనుగోలు కేంద్రాన్ని మంగళవారం వా రు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి కోనుగోలు కేంద్రా లల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు. ఏగ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ 1888, బీ గ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ. 1868 ప్రభుత్వం మద్దతు ధర ప్రటిచిందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పసర్తి అనిల్‌కు మార్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కాసనగోట్లు లింగన్న, ఏఎంసీ వైస్‌ ఛైర్మన్‌ రేణి శ్రీనివాస్‌, పిఏసిఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ అక్కల రవీందర్‌, సర్పంచులు కల్యాణ, మాధవి, దేవేంద్ర, శంకరయ్య, భీం, ఐకేపీ ఏపీఎం ప్రవీణ్‌కు మార్‌, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-21T04:55:56+05:30 IST