ప్రభంజనంలా రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-14T16:49:31+05:30 IST

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది.

ప్రభంజనంలా రైతుల మహాపాదయాత్ర

ప్రకాశం జిల్లా: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఆదివారం నాటికి 14వ రోజుకు చేరింది. అమరావతే ఏకైక రాజధాని లక్ష్యంగా ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట రైతులు పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజవర్గాలు దాటి ఆదివారం కొండేపి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది.


ఇవాళ ఒంగోలు మండలం, యర్రచర్ల నుంచి టంగుటూరు మండలం, ఎం నిడమానూరు వరకు 12.3 కి.మీ. మేర పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటి వరకు రైతుల మహాపాదయాత్ర 152.9 కి.మీ. పూర్తి చేసుకుంది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. 

Updated Date - 2021-11-14T16:49:31+05:30 IST