AP News: శ్రీరామవరం చేరుకున్న రైతుల పాదయాత్ర... వైసీపీ, టీడీపీ నినాదాలు.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-09-29T19:53:37+05:30 IST

జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపటి క్రితమే శ్రీరామవరం చేరుకుంది.

AP News: శ్రీరామవరం చేరుకున్న రైతుల పాదయాత్ర... వైసీపీ, టీడీపీ నినాదాలు.. ఉద్రిక్తం

ఏలూరు: జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati farmers padayatra) కాసేపటి క్రితమే శ్రీరామవరం చేరుకుంది. ఈ క్రమంలో వైసీపీ (YCP) సర్పంచ్ కామిరెడ్డి నాని(Kamireddy nani) ఇంటి వద్ద టీడీపీ (TDP), వైసీపీ (YCP) కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై అమరావతి, జై ప్రభాకర్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా... మూడు రాజధానులే ముద్దు,  జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైసీపీ జెండాలు చూపిస్తూ  ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాదాపు పావుగంట సేపు  నినాదాలు, ప్రతి నినాదాలు  సాగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పారు. చివరకు టీడీపీ కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. 


Updated Date - 2022-09-29T19:53:37+05:30 IST