సర్వే పనులను అడ్డుకున్న రైతులు
ABN , First Publish Date - 2021-07-27T04:13:18+05:30 IST
కెనాల్ నిర్మాణం కోసం సర్వేచేస్తున్న అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు.
సిద్దిపేట రూరల్, జూలై 26 : కెనాల్ నిర్మాణం కోసం సర్వేచేస్తున్న అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి, ఇర్కోడ్, వెంకటాపూర్, సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామాల మీదుగా నిర్మించ తలపెట్టిన ఓపెన్ కెనాల్ను రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే పనులు చేపట్టడంతో రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ ఎస్ఐ శంకర్ సంఘటనా స్థలానికి వెళ్లి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతులు సర్వే పనులు నిర్వహించవద్దంటూ అధికారులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ గ్రామాలను కలుపుతూ అవసరమైతే అండర్ టన్నెల్ నిర్మించాలని కోరారు. ఓపెన్ కెనాల్ నిర్మించడం తాము పూర్తిగా భూములు కోల్పోతామన్నారు.