రైతుల సమస్యలపై పోరాటం చేయాలి

ABN , First Publish Date - 2022-10-01T05:20:08+05:30 IST

రైతాంగ సమస్యలపై సమరశీల పో రాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలపై పోరాటం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్‌రెడ్డి

నల్లగొండరూరల్‌, సెప్టెంబరు 30: రైతాంగ సమస్యలపై సమరశీల పో రాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో శుక్రవా రం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించాలన్నారు. పీఎం ప్రణామ్‌ పేరుతో ఎరువులపై ఉన్న సబ్సిడీని ఎత్తివేసే విధంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. నల్లగొండ పట్టణంలో నవంబరు 8,9,10 వ తేదీలో రైతు సంఘం రాష్ట్ర మహా సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మ హాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షుడు సయ్యద్‌ హాశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు నారాయణరెడ్డి, సలీం, సత్తయ్య, వెంకటరమణారెడ్డి, అనురాధ, సైదులు, సత్యనారాయణ, అరుణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-01T05:20:08+05:30 IST