కొవ్వొత్తులతో రైతుల నిరసన

ABN , First Publish Date - 2022-07-05T04:57:53+05:30 IST

కరీంనగర్‌ జిల్లా గౌరవెల్లి నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించి రైతులకు బేడీలు వేయడం పట్ల జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి నిర్వాసితులు మండిపడ్డారు.

కొవ్వొత్తులతో రైతుల నిరసన
కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న చిన్నోనిపల్లి నిర్వాసితులు


గట్టు, జూలై 4: కరీంనగర్‌ జిల్లా గౌరవెల్లి నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించి రైతులకు బేడీలు వేయడం పట్ల జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి నిర్వాసితులు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా సోమవారం రాత్రి గ్రామ నిర్వాసిత రైతులు కొవ్వొత్తులు వెలగించి నిరసన తెలిపారు. న్యాయ పోరాటం చేస్తున్న రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించి హింసించడాన్ని వారు ఖండించారు. తెలంగాణ భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఆశప్ప ఆదేశానుసారం కొవ్వొతులతో ఐదు గ్రామాల నిర్వాసితులు నిరసన చేసినట్లు చిన్నోనిపల్లి నిర్వాసితులు తెలిపారు. 

Updated Date - 2022-07-05T04:57:53+05:30 IST