విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్త వహించాలి
ABN , First Publish Date - 2022-05-13T05:21:27+05:30 IST
రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంచిర్యాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత పేర్కొన్నారు. గురువారం గడ్పూర్ గ్రామంలో రైతులకు విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సర్టిఫైడ్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని, కొన్న వాటికి రశీదులు పొం దాలన్నారు.
హాజీపూర్, మే 12: రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంచిర్యాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత పేర్కొన్నారు. గురువారం గడ్పూర్ గ్రామంలో రైతులకు విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సర్టిఫైడ్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని, కొన్న వాటికి రశీదులు పొం దాలన్నారు. పత్తి, వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతు లకు వివరించారు. మార్గం రజిత, మౌనిక, రైతులు పాల్గొన్నారు.
కోటపల్లి: నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఏఈవో వైష్ణవి అన్నారు. గురువారం బొప్పారంలో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలని, పీఎం కిసాన్ పొందే ప్రతి రైతు ఈ కేవైసీ ఈ నెల 31లోగా చేసుకోవాలని సూచించారు. సర్పంచు జెల్ల సతీష్, రైతులు పాల్గొన్నారు.