రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2021-05-11T06:47:02+05:30 IST
రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు
మామడ, మే 10 : రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం రోజున మండలంలోని న్యూసాంగ్వి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటర్లలో ధాన్యం నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తూకం వేసి లారీల్లో రైస్ మిల్లుకు తరలించాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్వాహకులు ఉండవద్దు అన్నారు. నీటివసతి, టెంటు తదితర సౌకర్యాలు కల్పించాలని తెలి పారు. రైతులు తేమ శాతం వచ్చాకే సెంటర్కు తేవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. వీరి వెంట పీఏసీఎస్ కార్యదర్శి గంగారాం, తదితరులు పాల్గొన్నారు.