సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-05-19T07:03:00+05:30 IST

సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి అన్నారు. అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చీదెళ్ల గ్రామంలోని రైతు వేదికలో వానా కాలం పంటల సాగుపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి

పెన్‌పహాడ్‌, మే 18: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని పీఏసీఎస్‌  చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి అన్నారు. అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చీదెళ్ల గ్రామంలోని రైతు వేదికలో వానా కాలం పంటల సాగుపై  రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవీకే శాస్త్రవేత్త ఏ.కిరణ్‌ మాట్లాడుతూ భూసార పరీక్షకు మట్టి సేకరణ విధా నం, వివిధ రకాల జీవన ఎరువుల ఉపయోగం, వాటి ఫలితాలను రైతు లకు వివరించారు. ఉద్యానవన శాస్త్రవేత్తలు నరేష్‌, ఆదర్ష మాట్లాడుతూ  కూరగాయల తోటల సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. 



Updated Date - 2022-05-19T07:03:00+05:30 IST