రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
ABN , First Publish Date - 2022-05-16T06:43:49+05:30 IST
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై మొం డి వైఖరి అవలంభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా కొనుగోళ్లు చేస్తుందని ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూడాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి సూచించారు.
కథలాపూర్, మే 15 : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై మొం డి వైఖరి అవలంభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా కొనుగోళ్లు చేస్తుందని ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూడాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి సూచించారు. ఆదివారం భూషణరావుపేట సింగిల్ విండో పరిధిలో కొనసాగుతున్న కలికోట కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరలు పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం వెంటది వెంట కొనుగోలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్రావు, సర్పంచ్ దరావత్ సరోజసీతారాం, ఎంపీటీసీ గంగం దేవేం ద్రగంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రాజేశం ఉన్నారు.