రీసర్వే పనులు వేగవంతం చేయండి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-08-17T06:20:35+05:30 IST
వందశాతం భూ రికార్డుల స్వచ్ఛీకరణ రీసర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 16: వందశాతం భూ రికార్డుల స్వచ్ఛీకరణ రీసర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ నుంచి రీసర్వే పనులపై జేసీ వెంకటేశ్వర్తో పాటు ఆర్డీవోలు, తహసీల్దార్లు సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే 31 గ్రామాల్లో నోటిఫికేషన్ జారీచేశామన్నారు. ఈ వారం ఆఖరులోగా లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాకు ఆధార్, ఫోన్ నెంబరును డిసెంబరు 31లోగా అనుసంధానం పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎన్. రాజశేఖర్, ఆర్డీవోలు రేణుక, సృజన, సర్వే ఇన్స్పెక్టర్ లత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.