Boat accident: నెల్లూరులో ఘోర మరబోటు ప్రమాదం
ABN , First Publish Date - 2022-08-10T17:59:50+05:30 IST
జిల్లాలోని మంగుళూరు వద్ద అరేబియా మహాసముద్రంలో ఘోర మరబోటు ప్రమాదం జరిగింది.
నెల్లూరు: జిల్లాలోని మంగుళూరు వద్ద అరేబియా మహాసముద్రంలో ఘోర మరబోటు ప్రమాదం (Boat accident) జరిగింది. సముద్రంలో అలల ఉధృతికి బోటుకి కింది భాగంలో పెద్ద రంధ్రం పడింది. దీన్ని గుర్తించిన మత్స్యకారులు జీపీఎస్ (GPS) సాయంతో తోటి మత్స్యకారులకు సమాచారం అందించారు. వెంటనే తోటి మత్స్యకారులు మరో పడవలో సముద్రంలోకి వెళ్లి 11 మందిని రక్షించారు. కాగా.. దాదాపు రూ.కోటి విలువ చేసే బోటు సముద్రంలోనే మునిగిపోయింది. మత్స్యకారులు అందరూ నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, పెదరాముడు పాలెం, ఆదినారాయణ పురం, అల్లూరుకి చెందిన వారే. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.