కరోనాతో తండ్రి, కొడుకు మృతి

ABN , First Publish Date - 2021-05-09T05:54:16+05:30 IST

బంగారుపాళ్యానికి చెందిన రిటైడ్‌ ఆర్టీసీ ఉద్యోగి సాంబశివమూర్తి, ఆయన కుమారుడు మధు(48) కరోనాతో శనివారం మృతి చెందారు.

కరోనాతో తండ్రి, కొడుకు మృతి

బంగారుపాళ్యం, మే 8: బంగారుపాళ్యానికి చెందిన రిటైడ్‌ ఆర్టీసీ ఉద్యోగి సాంబశివమూర్తి, ఆయన కుమారుడు మధు(48) కరోనాతో శనివారం మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం వీరిద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సాంబశివమూర్తి హోమ్‌ ఇసోలేషన్‌లో ఉండగా, మధు తిరుపతిలోని పద్మావతి కొవిడ్‌ కేంద్రంలో చేరారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. 


మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి


బంగారుపాళ్యంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న తవణంపల్లె ఎంపీడీవో కార్యాలయ ఏవో రమణ(57) శనివారం కరోనాతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనతో పాటు భార్య, కుమారుడికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం భార్య మృతి చెందింది. తిరుపతిలో చికిత్స పొందుతూ కుమారుడు శుక్రవారం మృతి చెందాడు. హోమ్‌ ఇసోలేషన్‌లో ఉన్న రమణ శనివారం మృతి చెందారు.

Updated Date - 2021-05-09T05:54:16+05:30 IST