Suspicious deaths of 3 people: రాత్రి పూట అన్నం తిని నిద్రపోయిన తండ్రి, ఇద్దరు కొడుకులు.. తెల్లారేసరికి ముగ్గురూ మృతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-24T00:42:36+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మృతి మిస్టరీగా మారింది.

Suspicious deaths of 3 people: రాత్రి పూట అన్నం తిని నిద్రపోయిన తండ్రి, ఇద్దరు కొడుకులు.. తెల్లారేసరికి ముగ్గురూ మృతి.. అసలేం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మృతి మిస్టరీగా మారింది.  రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తండ్రి, ఇద్దరు కొడుకులు ఉదయం నిద్ర లేవలేదు. ప్రస్తుతానికి, వారి మరణాలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే కేసు విషయంలో ముందుకు వెళతామని పోలీసులు చెబుతున్నారు. 


ఇది కూడా చదవండి..

Heart wrenching incident: కూతుళ్లను నదిలో పారేసి.. హాయిగా నిద్రపోయిన తల్లి.. పిల్లల కోసం అంతా వెతుకుతోంటే..


బీజాపూర్ జిల్లాలోని జాగూర్ గ్రామానికి చెందిన బొమ్మ మాద్వి (50), అతని ఇద్దరు కుమారులు ముగ్రు (18), రాము (9) మరణించారు. గురువారం రాత్రి ముగ్గురూ భోజనంలో కొలియారి భజి, అన్నం తిన్నారని బంధువులు తెలిపారు. రాత్రి నిద్రపోయేటపుడు కూడా ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం చూస్తూ ముగ్గురూ అచేతనంగా పడి ఉన్నారు. ముగ్గురూ మరణించినట్టు తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. వారి మృతికి కారణాలేంటన్నది అంతుబట్టడం లేదు. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-24T00:42:36+05:30 IST