షాపులో బిజీగా ఉన్న కుమారుల వద్దకు తండ్రి వచ్చాడు.. అతనొచ్చిన కాసేపటికే జరిగిందో షాకింగ్ ఘటన.. ఇంతకీ ఏమైందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-15T18:00:20+05:30 IST

కుమారులిద్దరు దుకాణంలో..

షాపులో బిజీగా ఉన్న కుమారుల వద్దకు తండ్రి వచ్చాడు.. అతనొచ్చిన కాసేపటికే జరిగిందో షాకింగ్ ఘటన.. ఇంతకీ ఏమైందో తెలిస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: కుమారులిద్దరు దుకాణంలో బిజీగా ఉన్నారు. అప్పుడే వాళ్ల తండ్రి అక్కడికి వచ్చాడు. అతడిని చూసి ‘రా నాన్నా.. ఇలా కుర్చో’అని కుర్చీ ఇచ్చారు. తండ్రొచ్చిన కాసేపటికే షాపులో షాకింగ్ ఘటన జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని దక్షిణ్ కరౌండియాలో నివాసముంటున్న ఓ వ్యక్తికి సంజయ్ సాకెత్(26), రంజన్(21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతంగా చెప్పుల దుకాణం పెట్టుకుని కుమారులు ఇద్దరు కష్టపడి పనిచేసుకుంటున్నారు. వచ్చిన కాసిన్ని డబ్బులతోనే కడుపు నింపుకుంటున్నారు. అయితే, ఆదివారం సాయంత్రం వాళ్ల తండ్రి దుకాణానికి వచ్చాడు. తండ్రి రాకను గమనించి పెద్ద కుమారుడు సాకెత్ ఆయనకు కుర్చీ ఇచ్చి కూర్చోమన్నాడు. రంజన్ తన పని తాను చేసుకుంటున్నాడు. 



ఏమైందో ఏమో సాకెత్‌తో తండ్రి గొడవపెట్టుకున్నాడు. అది కాస్త పెద్దిదిగా కావడంతో.. సాకెత్ చేతిలోని చెప్పులు కుట్టే సూది, కత్తెర తీసుకొని అతడి కడుపులోనే తండ్రి పొడిచేశాడు. అన్నను తండ్రి పొడవడం చూసి రంజన్ షాక్‌కు గురయ్యాడు. సోదరుడిని కాపాడటానికి ప్రయత్నించగా.. రంజన్‌ను కూడా తండ్రి కత్తెరతో పొడిచేశాడు. కుమారులిద్దరు రక్తపు మడుగుల్లో పడి గిలగిల్లాడడం చూసి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. దుకాణంలో దారుణం జరుగుతున్న ఏ ఒక్కరూ కూడా కాపాడడానికి ప్రయత్నించలేదు.


పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రాణాలతో ఉన్న రంజన్‌కు జిల్లా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పారిపోయిన తండ్రిని పోలీసులు కాసేపటికే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌కు పది అడుగుల దూరంలో జరగడం గమనార్హం.



Updated Date - 2021-11-15T18:00:20+05:30 IST