కొడుకు చేతిలో తండ్రి హతం
ABN , First Publish Date - 2021-10-17T04:40:35+05:30 IST
కుటుంబ తగాదాలతో కన్న తండ్రిని సొంత కొడుకు దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది.
కుటుంబ తగాదాలే కారణం
పెద్దశంకరంపేటలో ఘటన
పెద్దశంకరంపేట, అక్టోబరు 16 : కుటుంబ తగాదాలతో కన్న తండ్రిని సొంత కొడుకు దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్ వివరాల ప్రకారం కోలపల్లి గ్రామానికి చెందిన రోమాల సాయిలు (52) భార్య సువర్ణ, కొడుకు అనిల్ ఉన్నారు. అనిల్ హైదరాబాద్లో భార్యాపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. దసరా రోజు అనిల్ గ్రామానికి వచ్చాడు. రాత్రి సమయంలో తండ్రీ, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అనిల్ ఇంట్లో ఉన్న రోకలిబండంతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్ట్, పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్, క్లూస్టీం వివరాలను సేకరించారు. కాగా మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.