ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పామును చంపేసిన వ్యక్తి.. 24గంటలు గడవకముందే అతడి ఇంట్లో విషాదం..

ABN , First Publish Date - 2022-04-10T21:20:23+05:30 IST

ఆయనది మారుమూల గ్రామం. కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చైత్ర నవరాత్రి సందర్భంగా అతడు నివసించే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో

ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పామును చంపేసిన వ్యక్తి.. 24గంటలు గడవకముందే అతడి ఇంట్లో విషాదం..

ఇంటర్నెట్ డెస్క్: ఆయనది మారుమూల గ్రామం. కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చైత్ర నవరాత్రి సందర్భంగా అతడు నివసించే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి అతడూ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో అతడి ఇంటి పరిసరాల్లోకి ఓ పాము వొచ్చింది. దాన్ని చూసి కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతడు ఆ పామును చంపేశాడు. అయితే 24 గంటల్లో అతడి ఇంట్లో విషాదం నెలకొంది. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని జోషీపూర్ గ్రామానికి చెందిన కిషోరీ లాల్ అనే వ్యక్తి కూలీగా పని చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చైత్ర నవరాత్రి సందర్భంగా గురువారం జోషీపూర్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిషోరీ లాల్ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారిని పూజించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఉదయం 8-9 గంటల మధ్య కిషోరీ లాల్ ఇంటి పరిసరాలకు ఓ పాము వచ్చింది. అది చూసి అతడి కుటుంబ సభ్యలు భయాందోళనకు గురయ్యారు. దీంతో కిషోరీ లాల్ తన కుటుంబ సభ్యలతో కలిసి దాన్ని చంపేశాడు. అయితే ఇది జరిగిన 24 గంటల్లోపే అతడి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో పడుకున్న ఉన్న కిషోరీ లాల్ కుమారుడు 12ఏళ్ల రోహిత్‌ను అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మరో పాము కాటేసింది. రోహిత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా రోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జోషీపూర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 




Updated Date - 2022-04-10T21:20:23+05:30 IST