కొడుకు హత్యకు ప్రతీకారం.. ఆ తండ్రి ఎంతటి దారుణానికి తెగించాడంటే.. కాళ్లు, చేతులు నరికి..

ABN , First Publish Date - 2022-02-27T05:47:59+05:30 IST

కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తన కొడుకును చంపేశాడనే అనుమానంతో ఓ యువకుడిని కిరాతకంగా హతమార్చాడు. పట్టపగలు అతడి కాళ్లు, చేతులు నరికేసి చంపేశాడు...

కొడుకు హత్యకు ప్రతీకారం.. ఆ తండ్రి ఎంతటి దారుణానికి తెగించాడంటే.. కాళ్లు, చేతులు నరికి..

కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తన కొడుకును చంపేశాడనే అనుమానంతో ఓ యువకుడిని కిరాతకంగా హతమార్చాడు. పట్టపగలు అతడి కాళ్లు, చేతులు నరికేసి చంపేశాడు. అనంతరం పోలీసులకు దొరికిపోయాడు. తన కొడుకు హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య చేశానని అతను పోలీసుల ఎదుట అంగీకరించాడు. 


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పృథ్వీపూర్‌లోని తేనిపురా గ్రామానికి చెందిన కున్న యాదవ్ కుమారుడు 2019లో చనిపోయాడు. దానిని ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని.. రాహుల్ అనే యువకుడు హత్య చేశాడని కున్న యాదవ్ అప్పుడు పోలీసులకు ఎంత చెప్పినా వారు పట్టింకోలేదని చెప్పాడు. 


ఈ కారణంగా రాహుల్‌పై కున్న యాదవ్ పగ పెంచుకున్నాడు. తన కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మూడేళ్లు ఎదురు చూశాడు. తాజాగా రాహుల్ ఇంటికి వెళ్లి అతడి కాళ్లు, చేతులు నరికేసి, ఆపై గొంతు కోసేశాడు. ఈ హత్యలో కున్న యాదవ్‌కు మరికొందరు సహకరించారు. హత్య జరిగిన 2 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


Updated Date - 2022-02-27T05:47:59+05:30 IST