కొడుకు పెళ్లి గురించి ఊరంతా చెప్పుకోవాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన.. చూసేందుకు ఎగబడ్డ జనం..!
ABN , First Publish Date - 2021-12-13T21:19:25+05:30 IST
వాళ్లిద్దరూ ప్రభుత్వోద్యోగులు.. వారికి ఒక్కగానొక్క కొడుకు.. ప్రస్తుతం డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు..
వాళ్లిద్దరూ ప్రభుత్వోద్యోగులు.. వారికి ఒక్కగానొక్క కొడుకు.. ప్రస్తుతం డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. అతనికి పెళ్లి కుదిరింది.. తన కొడుకు పెళ్లి గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలనేది ఆ తండ్రి కోరిక.. అందుకే వినూత్న ఆలోచన చేశాడు.. కోడలిని ఆమె ఊరి నుంచి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ హెలీకాఫ్టర్ను బుక్ చేశాడు.. దీంతో జనమంతా ఆ పెళ్లి గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు.. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఈ పెళ్లి జరుగుతోంది.
బార్మర్ జిల్లాలోని బిందాని గ్రామానికి చెందిన తిలారామ్, ఆయన భార్య పార్వతి ప్రభుత్వోద్యోగులు. వారి కొడుకు తరుణ్ డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తరుణ్కు ఇటీవల దియా అనే యువతితో పెళ్లి కుదురింది. ఈ రోజు (సోమవారం) రాత్రి వీరి వివాహం జరగబోతోంది. తమ ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని తిలారామ్, పార్వతి ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. వధూవరులను పెళ్లి మండపానికి కారులో కాకుండా హెలీకాఫ్టర్లో తీసుకురావాలని అనుకున్నారు.
రూ.6 లక్షల రూపాయలు పెట్టి ఓ హెలీకాఫ్టర్ను బుక్ చేశారు. అంతేకాదు అది దిగేందుకు ఆ గ్రామంలో ఓ హెలీప్యాడ్ను కూడా నిర్మించారు. వరుడు కొద్ది సేపటి క్రితం తను నివాసం ఉంటున్న నగరం నుంచి వధువు ఊరికి హెలీకాఫ్టర్లో వెళ్లి అక్కణ్నుంచి కల్యాణమండపానికి ఆమెను తీసుకువచ్చాడు. ఆ హెలీకాఫ్టర్ను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. ఈ పెళ్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.