Marriage: తండ్రి మైనపు విగ్రహం ముందు కుమారుడి వివాహం
ABN , First Publish Date - 2022-09-10T16:09:53+05:30 IST
సేలం నగరంలో తండ్రి మైనపు విగ్రహం ముందు కుమారుడు వివాహం చేసుకోవడంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. సేలం గుహ ప్రాంతానికి
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 9: సేలం నగరంలో తండ్రి మైనపు విగ్రహం ముందు కుమారుడు వివాహం చేసుకోవడంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. సేలం గుహ ప్రాంతానికి చెందిన పన్నీర్సెల్వం-పుష్పరాణి(Panneerselvam-Pushparani) దంపతులకు యేసురాజా అనే కుమారుడు, రసిక అనే కుమార్తె ఉన్నారు. గత ఏడాది కరోనా సోకి పన్నీర్సెల్వం మృతిచెందారు. ఆయన మరణించక ముందు కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించారు. తన కుమారుడికి కూడా అదే విధంగా వివాహం జరిపించాలని సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. అయితే కరోనా మహమ్మారి ఆయనను మే 26న బలిగొంది. యేసురాజా తన తండ్రి సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించి, బెంగుళూరు(Bangalore)లో తన తండ్రి ఆకారంతో తయారుచేయించిన మైనపు బొమ్మ ముందు శుక్రవారం ఉదయం వివాహం చేసుకోవడంపై, ఆ శుభకార్యంలో పాల్గొన్న కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.