Bhopal: నెలల పాటు మహిళను దారుణంగా.. ఆపై రూ.60 వేలకు అమ్మేశారు!

ABN , First Publish Date - 2021-07-14T21:36:40+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

Bhopal: నెలల పాటు మహిళను దారుణంగా.. ఆపై రూ.60 వేలకు అమ్మేశారు!

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తరువాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ.60 వేలకు అమ్మేశారు. భోపాల్ నగరంలో జరిగిన ఈ దారుణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.  బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు సదరు వ్యక్తి తండ్రికొడుకులతో డీల్ కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వివాహానికి గురించి తెలియడంతో వారు ఆమెను రక్షించి భర్తను అరెస్టు చేశారు. 


ఉద్యోగ వేటలో ఉన్న బాధితురాలికి నాలుగు నెలల క్రితం రవి పరిచయమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత అతడి తండ్రి రమేశ్‌ కూడా ఈ దారుణానికి తెగించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్మన్ ప్రజాపతి అనే వ్యక్తితో డీల్ కుదిరే వరకూ తనపై తండ్రీకోడుకులు దారుణానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-14T21:36:40+05:30 IST