షర్మిల పాదయాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం
ABN , First Publish Date - 2022-06-28T06:40:19+05:30 IST
షర్మిల పాదయాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వరరావు (జేవీఆర్)అన్నారు.
హుజూర్నగర్ , జూన్ 27: షర్మిల పాదయాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వరరావు (జేవీఆర్)అన్నారు. సోమవారం హుజూర్నగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ ఆర్టీపీ అధికారంలోకి వస్తుందన్నారు. హుజూర్నగర్ మండలంలో గ్రామకమిటీలను నియమించామన్నారు. హుజూర్నగర్లో నియోజకవర్గంలో జూలై నెల మొదటి వారంలో షర్మిల పాదయాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో సుతారి శ్రీనివాసరావు, ఖలీల్, రవికుమార్, మట్టపల్లి, వెంకటేష్, జానానాయక్, సైదులు, అంబేద్కర్, సురేందర్రెడ్డి,నర్సింహారావు, గోపి, తదితరులు పాల్గొన్నారు