కేసీఆర్‌కు ఎందుకంత భయం?: షర్మిల

ABN , First Publish Date - 2021-11-14T00:16:35+05:30 IST

రైతుల కోసం తాను దీక్షచేస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయం? అని షర్మిల ప్రశ్నించారు. ఇందిరాపార్క్ దగ్గర వైఎస్‌ఆర్‌టీపీ ఆధ్వర్యంలో

కేసీఆర్‌కు ఎందుకంత భయం?: షర్మిల

హైదరాబాద్: రైతుల కోసం తాను దీక్షచేస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయం? అని షర్మిల ప్రశ్నించారు. ఇందిరాపార్క్ దగ్గర వైఎస్‌ఆర్‌టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వేదన దీక్షను ముగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ లోటస్‌పాండ్‌లో దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. స్టేజ్ వేయనివ్వడం లేదు, వేసినా తీసేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోలీసు జులుం నడుస్తోందన్నారు. ప్రతిగింజా కొంటామన్న కేసీఆర్‌..మాట నిలుపుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇస్తున్నామని, ధాన్యం కొనకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. ధాన్యం కొనడం చేతకాక కేసీఆర్‌ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ మెడలు వంచైనా సరే వడ్లు కొనేలా చేస్తామని షర్మిల చెప్పారు.


Updated Date - 2021-11-14T00:16:35+05:30 IST