ఫిబ్రవరి 20 నుంచి రెండోవిడత పాదయాత్ర
ABN , First Publish Date - 2022-01-30T17:17:05+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు తొలగించిన మేరకు మేకెదాటు పాదయాత్రను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్ వెల్లడించారు. శనివారం ఆయన రామనగరలో మీడియా
- ఎంపీ డీకే సురేశ్
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు తొలగించిన మేరకు మేకెదాటు పాదయాత్రను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్ వెల్లడించారు. శనివారం ఆయన రామనగరలో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 20 నుంచి పాదయాత్ర ఆగిన చోటు నుంచి శ్రీకారం చుడతామన్నారు. బెంగళూరులో ముగింపు ఉంటుందన్నారు. రెండోవిడత యాత్రకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. కొవిడ్ నిబంధల పేరిట తొలి విడత యాత్రకు ఆటంకం కలిగించారన్నారు. మేకెదాటు నిర్మాణాలు పూర్తయితే బెంగళూరుతోపాటు అనుబంధంగా ఉండే వేలాది గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు సాధ్యమవుతుందన్నారు. కర్ణాటక కోటాలోని నీటిని వాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఇదే సందర్భంలో జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొందరు అసత్యాలను ఇంటి దేవుడిగా చేసుకున్నారని విమర్శించారు.