ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T07:11:15+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిఽ బాలు అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి



కామారెడ్డిటౌన్‌, జూలై 23:
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిఽ బాలు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లుగా విద్యార్థుల స్కాలర్‌ షిప్‌లు, కళాశాలలకు చెందిన ఫీజులను విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. 50 ఎకరాలు ఉన్న ధనిక రైతులకు ప్రతీ సంవత్సరానికి రూ.ఐదు లక్షలు రైతుబంధు ద్వారా ఇస్తుంటే, పేద విద్యార్థులకు మాత్రం ఇవ్వాల్సిన స్కాలర్‌ షిప్‌, రీయింబర్స్‌మెంట్‌లు ఇవ్వకపోవడం కేసీఆర్‌ అసమర్థపాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే అన్నిరకాల స్కాలర్‌ఫిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్‌ నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, సతీష్‌, అంజల్‌రెడ్డి, నవీన్‌, సందీప్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T07:11:15+05:30 IST