స్వాతంత్య్ర సమరయోధుడు టీసీరాజన్కు ఘనసన్మానం
ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ శాసనసభ్యుడు టీసీరాజన్ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాజన్ను మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ఎం.పవిత్ర, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, తహసీల్దార్ కుప్పస్వామి, ఎంపీడీవో విద్యాసాగర్ శాలువలు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.
పలమనేరు, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ శాసనసభ్యుడు టీసీరాజన్ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాజన్ను మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ఎం.పవిత్ర, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, తహసీల్దార్ కుప్పస్వామి, ఎంపీడీవో విద్యాసాగర్ శాలువలు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఇక మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్... రాజన్కు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా టీసీ రాజన్ మాట్లాడుతూ... తామంతా ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నామని, స్వాతంత్య్రం అనంతరం దేశంలో పరిపాలనలో క్రమేపీ స్వార్థం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వినోభాబావే స్ఫూర్తితో తన తండ్రినుంచి సంక్రమించిన భూములను, ప్రభుత్వం నుంచి అందిన సహాయాన్ని ప్రజల కోసం పంచి పెట్టానన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ ఖాదర్మోహిద్దీన్, పలమనేరు శానిటరీ ఇన్ఛార్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.