TS News: రామకృష్ణ మఠంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

ABN , First Publish Date - 2022-08-17T03:56:35+05:30 IST

Hyderabad: స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా దోమల గూడ రామక్రిష్ణ మఠం (Sri Ramakrishna Matt) పరిసరాల్లో నివసించే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, దినసరి కూలీలు, ఆటో డ్రైవర్‌లను హైదరాబాద్ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద (Bodhamayaananda) ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా బోధమయానంద

TS News: రామకృష్ణ మఠంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Hyderabad: స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా దోమల గూడ రామకృష్ణ మఠం (Sri Ramakrishna Matt) పరిసరాల్లో నివసించే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, దినసరి కూలీలు, ఆటో డ్రైవర్‌లను హైదరాబాద్ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద (Bodhamayaananda) ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా బోధమయానంద మాట్లాడుతూ.. స్వామి వివేకానంద (Swamy Vivekananda) ప్రవచించిన ‘మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ, రోగి దేవోభవ’ సిద్ధాంతాలను మఠం వారు నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా ఆచరణలో పెడుతున్నారని చెప్పారు. దైనందిన జీవితంలో విశేష పాత్ర పోషిస్తున్న ఇటువంటి వారిని సత్కరించుకోవడం మన బాధ్యత అని ఉద్బోధించారు. కార్యక్రమంలో మఠానికి చెందిన ఇతర స్వామీజీలు, సిబ్బంది పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-17T03:56:35+05:30 IST