గూండాయిజం చేస్తే బీజేపీలో సన్మానం: ఆప్

ABN , First Publish Date - 2022-04-16T00:45:48+05:30 IST

బీజేపీ గూండలాను పోషిస్తోంది. వారికి సన్మానాలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి పాల్పడ్డ ఎనిమిది మంది గూండాలను బీజేపీ సన్మానించింది. అది కూడా బీజేపీ కార్యాలయంలో, ఢిల్లీ బీజేపీ అధినేత ఆదేశాల మేరకు జరిగింది..

గూండాయిజం చేస్తే బీజేపీలో సన్మానం: ఆప్

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడికి పాల్పడ్డ వారికి భారతీయ జనతా పార్టీ నేతలు సన్మానం చేశారని, దీన్ని బట్టి ఆ పార్టీ విధానమేంటో స్పష్టమవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశి అన్నారు. గూండాయిజం, రౌడీయిజం చేయమని బీజేపీ ప్రోత్సహిస్తోందని, అలా చేసిన వారికి సన్మానాలు సైతం చేస్తోందని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసంపైనే పట్టపగలు దాడి జరుగుతుంటే ఈ దేశంలో సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ విషయమై శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అతిశి మాట్లాడుతూ ‘‘బీజేపీ గూండలాను పోషిస్తోంది. వారికి సన్మానాలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి పాల్పడ్డ ఎనిమిది మంది గూండాలను బీజేపీ సన్మానించింది. అది కూడా బీజేపీ కార్యాలయంలో, ఢిల్లీ బీజేపీ అధినేత ఆదేశాల మేరకు జరిగింది. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? గూండాగిరి చేస్తే బీజేపీలో సన్మానాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-16T00:45:48+05:30 IST