గ్రామ పెద్దగా నలుగురికీ బుద్ధి చెప్పాల్సిన మహిళ.. మరొకరితో ప్రేమాయణం.. హాట్‌టాపిక్‌గా మారిన ఘటన

ABN , First Publish Date - 2022-03-20T22:34:43+05:30 IST

గ్రామ పెద్దగా నలుగురికీ మంచి చెడులను చెప్పాల్సిన మహిళ.. దారుణానికి పాల్పడింది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ మరొకరితో ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లోంచి

గ్రామ పెద్దగా నలుగురికీ బుద్ధి చెప్పాల్సిన మహిళ.. మరొకరితో ప్రేమాయణం.. హాట్‌టాపిక్‌గా మారిన ఘటన

ఇంటర్నెట్ డెస్క్: గ్రామ పెద్దగా నలుగురికీ మంచి చెడులను చెప్పాల్సిన మహిళ.. దారుణానికి పాల్పడింది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ మరొకరితో ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లోంచి పారిపోయింది. బిహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సీతామర్హి జిల్లాలోని ఖాప్ ఖోప్రాహా గ్రామానికి చెందిన రేఖా దేవి అనే మహిళకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు కొడుకులు, ఓ కూతురికి జన్మనిచ్చింది. కొద్ది రోజుల క్రితం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసి, 161 ఓట్లతో గ్రామ ప్రెసిడెంట్‌గా ఎన్నికయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కాగా.. ఎన్నికల సమయంలో అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తికి రేఖా దేవి దగ్గరైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడినట్టు చెబుతున్నారు. సంజయ్‌తో కలిసి రేఖా దేవి పారిపోయిందని అంటున్నారు. 



ఇదిలా ఉంటే.. తన భార్య కనిపించడం లేదంటూ రేఖా దేవి భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంజయ్‌తోపాటు అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశాడు. ఎలాగైనా తన భార్య ఆచూకీ కనిపెట్టాలని అధికారులను అభ్యర్థించాడు. రేఖా దేవి పెద్ద కుమారుడు పాట్నాలో బిఎస్సీ చదువుతుండగా.. ఆమె కూతురు 10వ తరగతి, చిన్న కుమారుడు 9వ తరగతి చదువుతున్నారు.




Updated Date - 2022-03-20T22:34:43+05:30 IST