ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి దోహదం

ABN , First Publish Date - 2021-07-22T05:30:00+05:30 IST

మహిళల ఆర్థికాభివృద్ధికి స్త్రీ నిధి రుణాలు ఎంతగానో దోహ దపడతాయని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌రాజ్‌కుమార్‌ తెలిపారు.

ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి దోహదం
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థికాభివృద్ధికి  స్త్రీ నిధి రుణాలు ఎంతగానో దోహ దపడతాయని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌రాజ్‌కుమార్‌ తెలిపారు. గురువారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఏపీడీ సావిత్రి, ఏజీఎం ఉమామహేశ్వరావు,  సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.  ఈ ఏడాది స్త్రీ నిధి రుణాలు రూ.160.50 కోట్లకు గాను, 19, 950 మంది సభ్యులకు రూ.35 కోట్ల మేర అందించినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకి ప్రతి మండలానికి రూ.2 కోట్లు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. వాటిని సక్రమంగా వినియోగించుకునేలా అధి కారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఆదాయం వచ్చేలా సిబ్బంది సహకారం అందించాలని సూచించారు. అదేవిధంగా శతశాతం రికవరీ ఉండేటట్లు చూడాలన్నారు. ఇందుకు సంబంధించి వెలుగు, డీఆర్‌డీఏ సిబ్బంది మండలాల వారీగా సమవేశాలు నిర్వహించాలని తెలిపారు. సమస్యలు ఉన్నచోట వెంటనే స్థానిక సిబ్బంది పరిష్కరించాలన్నారు.
 
 

Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST