బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేయాలి

ABN , First Publish Date - 2021-10-24T07:14:18+05:30 IST

పొగాకు బోర్డు ద్వారా ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయాలని చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబును రైతులు కోరారు.

బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేయాలి
రైతులతో మాట్లాడుతున్న రఘునాథబాబు

చైర్మన్‌ రఘునాథబాబును కోరిన పొగాకు రైతులు 

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 23 : పొగాకు బోర్డు ద్వారా ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయాలని చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబును రైతులు కోరారు. శనివారం స్థానిక రీజనల్‌ కార్యాలయంలో రైతులతో రఘునాథబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు వేలంలో ఎక్కువ కంపెనీలు పాల్గొనే విధంగా బోర్డు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన  బోర్డు చైర్మన్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.




Updated Date - 2021-10-24T07:14:18+05:30 IST