ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2022-06-29T05:07:01+05:30 IST
మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయా ధికారులు నాగేశ్వరరావు, సాంకేతిక వ్యవసాయాధికారి నాగభూషణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బద్వేలు, జూన్ 28: మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయా ధికారులు నాగేశ్వరరావు, సాంకేతిక వ్యవసాయాధికారి నాగభూషణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన ఆధారాలు లేనట్టి 108 బస్తా లు 14ః35ః14 ఎరువులు, సింగల్ సూపర్ పాస్పేట్ ఎరువులు 294 బస్తాల స్టాప్ సేల్స్ గుర్తించామన్నారు. వీటి విలువ రూ. 3,23,250 లని తెలిపారు. వీరివెంట ఏఓ చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజుపాళెం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.