గ్రామోత్సవంపై నిషేధం
ABN , First Publish Date - 2020-11-29T04:57:45+05:30 IST
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవాన్ని కార్తీకపౌర్ణమి పర్వదినాన నిషేధించినట్లు ఆలయ ఈవో ఎన్.వి.రమణయ్య తెలిపారు.
శ్రీముఖలింగం (జలుమూరు), నవంబరు 28: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవాన్ని కార్తీకపౌర్ణమి పర్వదినాన నిషేధించినట్లు ఆలయ ఈవో ఎన్.వి.రమణయ్య తెలిపారు. కార్తీకపౌర్ణమి రోజు రాత్రి ఆలయ శిఖరాగ్ర దీపం వెలిగించి... జ్వాలాతోరణం వేలాడదీసి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శిఖరాగ్రదీపం వెలిగించి జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం నిషేధించామని వివరించారు.