పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

ABN , First Publish Date - 2022-08-08T05:39:40+05:30 IST

గ్రామాల్లో మొహర్రం, వినాయక చవితి పండుగలను హిందూ, ముస్లింలు ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు.

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ
సీఐ, ఎస్‌ఐలతో చర్చిస్తున్న డీఎస్పీ వెంకటరామయ్య

చాగలమర్రి, ఆగస్టు 7: గ్రామాల్లో మొహర్రం, వినాయక చవితి పండుగలను హిందూ, ముస్లింలు ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. చాగలమర్రి గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం పర్యవేక్షించారు. డీఎస్పీ మాట్లాడుతూ మొహర్రం వేడుకలను హిందూ, ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:39:40+05:30 IST