తరువాత ఆ శిశువు మృతిచెందడంతో తమకు చూపించి, తిరిగి వారు తీసుకు వెళ్లిపోయారని తెలిపారు. మర్నాడు తమకు ఆ శిశువు మృతదేహాన్ని అప్పగించారని, అయితే ఆ శిశువు మృతదేహన్ని ఎలుకలు కొరికివేసిన విషయాన్ని తాము గమనించామని తెలిపారు. ఈ విషయమై తాము ఆసుపత్రి సిబ్బందిని అడగగా, వారు నిరక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంఓ డాక్టర్ బీపీ సింగ్ మాట్లాడుతూ ఆ శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయా లేదా అనే దానిపై విచారణ చేపట్టనున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఈ విషయం తెలుస్తుందన్నారు.