హంతకులకు శిక్ష పడే వరకు పోరాటం
ABN , First Publish Date - 2021-03-02T05:31:20+05:30 IST
న్యాయవాదులను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హత్యచేసిన దుండ గులకు చట్ట ప్రకారం శిక్ష పడేవరకు పోరాటం కొ నసాగుతుందని కల్వకుర్తి న్యాయవాదులు పేర్కొ న్నారు.
- కల్వకుర్తిలో న్యాయవాదుల నిరాహార దీక్ష
కల్వకుర్తి టౌన్, మార్చి 1 : న్యాయవాదులను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హత్యచేసిన దుండ గులకు చట్ట ప్రకారం శిక్ష పడేవరకు పోరాటం కొ నసాగుతుందని కల్వకుర్తి న్యాయవాదులు పేర్కొ న్నారు. సోమవారం స్థానిక కోర్టు ముందు చేపట్టి న నిరాహార దీక్షలో వారు మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను హత్య చేయడం జరిగిందని, అయితే వారిని శిక్ష నుంచి తప్పించేందుకు రాజకీయంగా ప్రయత్నాలు కొన సాగుతున్నాయన్నారు. దీక్ష నిర్వహించిన వారిలో చిందం కృష్ణయ్య, సత్యం, ప్రశాంత్ ఉండగా.. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, వెంకటరమణ, వెంకట్రెడ్డి, అమరేందర్, జగన్, రాంగోపాల్, నాగరాజు, ఆంజనేయులు, శేఖర్, రామకృష్ణ సంఘీభావం తెలిపారు.