యువకుడిని చంపిన పందెం కోడి

ABN , First Publish Date - 2022-02-09T05:39:05+05:30 IST

కోడి పందేలు చూడడానికి వచ్చిన ఒక వ్యక్తిపై ఒక పందెం కోడి తన కాలికి కట్టి ఉన్న కత్తితో దాడి చేసింది. ఆ వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. ఈ ఘటన తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది...

యువకుడిని చంపిన పందెం కోడి

కోడి పందేలు చూడడానికి వచ్చిన ఒక వ్యక్తిపై ఒక పందెం కోడి తన కాలికి కట్టి ఉన్న కత్తితో దాడి చేసింది. ఆ వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. ఈ ఘటన తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామంలో  ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మరణించారు. ఆయన మరణించి 11వ రోజు స్మారకంగా గ్రామంలో ఆదివారం కోడి పందేలు నిర్వహించారు. ఆ పందేలు చూడడానికి గంగులయ్య(37) అనే యువకుడు వచ్చాడు. అక్కడ ఒక కోడి పందెం జరుగుతున్న సమయంలో  ఒక కోడి ఎగిరి గంగులయ్యపై దాడి చేసింది. ఈ దాడిలో కోడి కాలికి ఉన్న కత్తి గంగులయ్య అరికాలిపై మడమ భాగంలో  నరం తెగి తీవ్ర రక్త స్రావమైంది. 


గంగులయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు చెప్పారు. 


కోడి పందేలంటే దక్షిణ భారత దేశంలో పరువు పోటీలకు ప్రతీక. కానీ అలాంటి పోటీలను సుప్రీం కోర్టు నిషేధించిది. అయినా రాజకీయ నాయకుల అండదండలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పోటీలు అక్రమంగా సాగుతున్నాయి.


Updated Date - 2022-02-09T05:39:05+05:30 IST