ఉద్యోగాలు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-11-27T06:03:23+05:30 IST

ఎన్‌పీఎస్‌, జీడీఎస్‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీచేయాలని పోస్టల్‌, ఆర్‌ఎంఎస్‌ నా యకులు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలి

పెద్దబజార్‌,  నవంబరు 26: ఎన్‌పీఎస్‌, జీడీఎస్‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీచేయాలని పోస్టల్‌, ఆర్‌ఎంఎస్‌  నా యకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పోస్టల్‌ కా ర్యాలయం ఎదుట గురువారం ఉద్యోగులు కేంద్ర సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమంలో  పాల్గొన్నారు. స మ్మెలో భాగంగా నాయకులు మాట్లాడుతూ రోజురోజుకు అనేక విధమైన పథకాలను ప్రవేశపెట్టి సి బ్బందిని ఇబ్బంది పెట్టడం, కరువుభత్యం నిలిపివే యడం, జీడీఎస్‌ న్యాయమైన కోరికలు నెరవేర్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ న్నారు. నిత్యావసరానికి సామాన్యుడికి తపా లా శాఖ ఎంతో అవసరమన్నారు. పని పెంచడమే త ప్పా ఖాళీలను మాత్రం భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం గుర్తించి సరైన క్రమంలో అన్ని విధాలా సామాన్య మానవునికి అందుబాటులో ఉంచి సక్రమంగా సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకుడు లింబాద్రి, నారాయణ, షేక్‌ హుస్సేన్‌, ఇక్బాల్‌, భిక్షపతి, కిషన్‌, రవీందర్‌రెడ్డి, గిరిరాజ్‌, ఎస్‌.బి.హుస్సేన్‌, నవీన్‌కుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T06:03:23+05:30 IST