ట్విటర్కు ఫైనల్ వార్నింగ్
ABN , First Publish Date - 2022-06-30T09:24:19+05:30 IST
ఇప్పటివరకు జారీ చేసిన ఆదేశాలన్నింటినీ వచ్చేనెల 4వ తేదీ నాటికల్లా అమలు చేయాల్సిందేనని ట్విటర్కు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ ఆఖరి నోటీసు జారీ చేసింది.
ఆదేశాల అమలుకు గడువు జూలై 4
న్యూఢిల్లీ: ఇప్పటివరకు జారీ చేసిన ఆదేశాలన్నింటినీ వచ్చేనెల 4వ తేదీ నాటికల్లా అమలు చేయాల్సిందేనని ట్విటర్కు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ ఆఖరి నోటీసు జారీ చేసింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయలేని పక్షంలో ట్విటర్ ఇంటర్మీడియేటరీ హోదాను కోల్పోవచ్చని, తత్ఫలితంగా యూజర్లు తన వేదికపై పోస్ట్ చేసే అన్ని కామెంట్స్కు కంపెనీయే బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, నోటీసుపైౖ ట్విటర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.