ఎట్టకేలకు రహదారి సమస్య పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-08T05:25:13+05:30 IST

రాయచోటి- అంగళ్ళు మార్గ మధ్యంలోని రహదారి సమ స్యను ఎట్టకేలకు పరిష్కరిం చారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు దాదాపు గా పూర్తయ్యాయి.

ఎట్టకేలకు రహదారి సమస్య పరిష్కారం
రైతులతో మాట్లాడుతున్న తహశీల్దార్‌ భీమేశ్వరరావు

కురబలకోట, ఆగస్టు 7: రాయచోటి- అంగళ్ళు మార్గ మధ్యంలోని రహదారి సమ స్యను ఎట్టకేలకు పరిష్కరిం చారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు దాదాపు గా పూర్తయ్యాయి. అయితే మట్లి వారిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 833-1ఏ లో 0.91 ఎకరాలకు సంబంధించి రైతులు తమకు భూ పరిహార విషయం లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రైతులు రోడ్డుకు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ భీమేశ్వరరావు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి రైతులతో మాట్లాడి ఒప్పించారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.


Updated Date - 2022-08-08T05:25:13+05:30 IST