పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-05-09T04:57:25+05:30 IST
కరోనా బారినపడి గతనెలలో మృతిచెందిన బెవర రామచం ద్రుడు కుటుంబానికి అతనితో కలిసి చదువుకున్న పదో తరగతి విద్యార్థులు (పూర్వ విద్యార్థులు) బాసటగా నిలిచారు. మృతుడి భార్యకు శనివారం రూ.41,600 మొత్తాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఎల్.ఎన్.పేట: కరోనా బారినపడి గతనెలలో మృతిచెందిన బెవర రామచం ద్రుడు కుటుంబానికి అతనితో కలిసి చదువుకున్న పదో తరగతి విద్యార్థులు (పూర్వ విద్యార్థులు) బాసటగా నిలిచారు. మృతుడి భార్యకు శనివారం రూ.41,600 మొత్తాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. తలగాం నివాసి అయిన రామచంద్రుడు ప్రస్తుతం బొత్తాడసింగి గ్రామంలో స్థిరపడ్డాడు. ఆయనకు ఇద్దరు పిల్లలుండగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈ మొత్తాన్ని అందించినట్లు పూర్వ సహచరులు జి.నాగేశ్వరరావు, ధనుంజయరావు తెలిపారు.