అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం

ABN , First Publish Date - 2021-12-13T22:40:24+05:30 IST

కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15 వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు

అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం

హైదరాబాద్: కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15 వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు. డిసెంబర్ 15 న ఉదయం11.30 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్బంగా అనారోగ్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-12-13T22:40:24+05:30 IST