కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-05-11T07:23:13+05:30 IST
అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ కుటుంబానికి 2009 బ్యాచ్కు చెందిన తోటి కానిస్టేబుళ్లు ఆర్థికసాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు
మానవత్వం చాటిన బ్యాచ్మేట్స్
నల్లగొండ క్రైం, మే 10: అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ కుటుంబానికి 2009 బ్యాచ్కు చెందిన తోటి కానిస్టేబుళ్లు ఆర్థికసాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పీసీగా పని చేస్తున్న పీసీ రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ బ్యాచ్కు చెందిన సుమారు 200 మంది పీసీలు రూ.2,57,500లను సేకరించి సోమవారం ఆయన భార్య భవాని, కుమారు లు వర్షిత్, తేజగౌడ్లకు అందజేశారు. మానవత్వం చాటిన పీసీలకు రాచకొండ సీపీ మహేష్భగవత్, నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు రంగనాథ్, భాస్కరన్, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.