విషాదం: రెజ్లింగ్ క్రీడాకారుడి ప్రాణాలు తీసిన ఆర్థిక ఇబ్బందులు
ABN , First Publish Date - 2020-07-06T13:33:16+05:30 IST
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ (24)
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.