మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-07-25T06:14:55+05:30 IST

మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నాడో వ్యక్తి. ర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా వైద్యశాల నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక రామచంద్ర బాధపడుతుండడంతో చేనేతనగర్‌కు చెందిన కళ్యాణ్‌ దాబా నిర్వాహకుడు తొట్ల సూర్యచంద్రారెడ్డి బాధిత కుటుంబానికి రూ.12 వేలు సాయం అందజేశాడు.

మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
రామచంద్రకు నగదు అందజేస్తున్న సూర్యచంద్రారెడ్డి

మదనపల్లె క్రైం, జూలై 24: మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నాడో వ్యక్తి. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన రామచంద్ర నాయుడు కుమారుడు సంజీవ(22) కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌., ఫైనలియర్‌ చదువుతూ చేనేత నగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు. తనను చదివించేందుకు తల్లిదండ్రులు పడుతున్న శ్రమ, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.  జిల్లా వైద్యశాల నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక రామచంద్ర బాధపడుతుండడంతో చేనేతనగర్‌కు చెందిన కళ్యాణ్‌ దాబా నిర్వాహకుడు తొట్ల సూర్యచంద్రారెడ్డి బాధిత కుటుంబానికి రూ.12 వేలు  సాయం అందజేశాడు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.  

Updated Date - 2021-07-25T06:14:55+05:30 IST