హోటల్స్‌కు జరిమానా

ABN , First Publish Date - 2020-10-25T11:22:24+05:30 IST

పట్టణంలోని కరోనా నిబంధనలు పాటించని రెండు హోటళ్లకు అధికా రులు జరిమానా విధించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ..

హోటల్స్‌కు జరిమానా

పులివెందుల టౌన్‌, అక్టోబరు 24: పట్టణంలోని కరోనా నిబంధనలు పాటించని రెండు హోటళ్లకు అధికా రులు జరిమానా విధించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ -19 స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అధి కారులు శనివారం పట్టణంలోని అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టా రు. ఈ సందర్భంగా పట్టణంలోని అభిరుచి, తాజ్‌ హోటల్స్‌ను మున్సి పల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌ తనిఖీలో నిల్వ ఉంచిన పదార్థాలను పరిశీలించారు. వంట గదిని క్షుణ్ణం గా పరిశీలించారు. కొవిడ్‌ ఏ విధం గా చేపట్టారో పరిశీలించారు. దీంతో హోటల్స్‌లో కొవిడ్‌ నిబంధనలు ఎందుకు పాటించలేదని నిర్వాహకు లను ప్రశ్నించారు. అనంతరం ఆయా హోటల్స్‌కు జరిమానా విధించారు. మళ్లీ జరిగితే హోటల్స్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:22:24+05:30 IST